చెరువులో పడి ఐదుగురి చిన్నారుల మృతి

11 Aug, 2013 18:44 IST|Sakshi

ప్రకాశం: ఐదుగురు చిన్నారులు చెరువులోపడి మృతి చెందిన ఘటన కురంచెడు మండలం గంగాదన కొండలో ఆదివారం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు చెరువులో పడిన చిన్నారులు మృత్యవాత పడ్డారు. దీంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. చిన్నారుల కుటంబీకులు, బంధువుల రోదన పలువుర్ని కంట తడిపెట్టిస్తోంది.

 

ఇదిలా ఉండగా, శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం అక్కుపల్లి శివసాగర్ బీచ్‌లోకి స్నానానికి వెళ్లిన ఇద్దరు విద్యార్థులు గల్లంతైయ్యారు.

మరిన్ని వార్తలు