ఘోర రోడ్డు ప్రమాదం : నలుగురు బీటెక్‌ విద్యార్థుల దుర్మరణం

31 Dec, 2018 13:27 IST|Sakshi

సాక్షి, గుంటూరు : గుంటూరు రూరల్ మండలం లాల్ పురం వద్ద సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కాలేజీ నుంచి మెయిన్‌ రోడ్డువైపు వస్తుండగా కారు అతివేగంతో అదుపుతప్పి ముందుగా డివైడర్‌ను ఢీకొట్టింది. అనంతరం అటువైపుగా వేగంగా వస్తున్న వ్యాన్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు ఆర్వీఆర్ ఇంజినీరింగ్‌ కాలేజీ విద్యార్థులు మృతిచెందారు. వీరందరూ బీటెక్‌ సెకండ్‌, థర్డ్‌ ఇయర్‌ చదువుతున్న విద్యార్థులుగా తెలుస్తోంది. ఈ సంఘటనలో కారు నుజ్జు నుజ్జు అయింది.

దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన వైఎస్‌ జగన్‌
రోడ్డు ప్రమాదంలో ఇంజనీరింగ్‌ విద్యార్థుల మృతి వార్త విని ప్రతిపక్షనేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చలించిపోయారు. విద్యార్థుల మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. మృతుల కుటుంబాలకు వైఎస్‌ జగన్‌ తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.


మరిన్ని వార్తలు