ఐదుగురు జూదరుల అరెస్ట్

21 Mar, 2016 08:55 IST|Sakshi

కంకిపాడు: కృష్ణా జిల్లా కంకిపాడు మండలం నెప్పల్లిలో ఓ పేకాట శిబిరంపై ఆదివారం రాత్రి పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఐదుగురు పట్టుబడ్డారు. వారి నుంచి రూ.10, 410 నగదు స్వాధీనం చేసుకున్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఎస్ఐ హనీష్ నేతృత్వంలో ఈ దాడులు జరిగాయి. నిందితులపై కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ తెలిపారు.

మరిన్ని వార్తలు