అయిదేళ్ల బాలికపై బాబాయ్ అత్యాచారం

1 Apr, 2014 11:00 IST|Sakshi

గుంటూరు : అభం శుభం తెలియని చిన్నారిపై ఓ మానవ మృగం అఘాయిత్యానికి పాల్పడింది. గుంటూరు జిల్లాలో ఈ దారుణం జరిగింది. జొన్నలగడ్డలో అయిదేళ్ల బాలికపై బాబాయ్ అత్యాచారానికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. అంగన్ వాడీ పాఠశాలకు వెళ్లి వస్తున్న ఐదేళ్ల బాలికను బాబాయి శ్రీకాంత్ తన బైక్ మీద తీసుకెళ్లి ఈ ఘటనకు పాల్పడ్డాడు. బాలిక ఏడుస్తూ ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పటంతో అసలు విషయం బయటపడింది. దాంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా నిందితుడు శ్రీకాంత్ పరారీలో ఉన్నాడు. ఈ సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు