ఐదేళ్ల బాలికపై అత్యాచారం

3 Jan, 2016 20:05 IST|Sakshi

బాపట్ల (గుంటూరు): ఐదేళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. గుంటూరు జిల్లా బాపట్ల మండలం చెరువుజమ్ములపాలెం గ్రామంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. గ్రామానికి చెందిన ఐదేళ్ల బాలికను డిసెంబర్ 31న అమ్మమ్మ చర్చికి తీసుకెళ్లింది. బాలికకు బాబాయి వరుసయ్యే గొల్లపల్లి దిలీప్ (24) చిన్నారిని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. బాలికకు రక్తస్రావం అవుతుంటే ఆదివారం బాపట్ల ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అత్యాచారం జరిగినట్టు వైద్యులు వెల్లడించడంతో చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మరిన్ని వార్తలు