540 గ్రాముల బంగారం స్వాధీనం

11 Oct, 2013 14:31 IST|Sakshi

మూడు ముఠాలకు చెందిన ఏడుగురు దొంగలను వరంగల్ జిల్లా పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 540 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని స్టేషన్కు తరలించారు. దొంగల నుంచి స్వాధీనం చేసుకున్న బంగారం విలువ రూ.16.50 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. దొంగలపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు వరంగల్ జిల్లా పోలీసులు వెల్లడించారు.

మరిన్ని వార్తలు