బస్సు బోల్తా: ఆరుగురికి గాయాలు

18 Feb, 2016 16:09 IST|Sakshi

ఉదయగిరి (నెల్లూరు జిల్లా) : ఉదయగిరి మండలం సర్వరాబాద్ దగ్గర గురువారం మధ్యాహ్నం ఓ ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఆరుగురికి గాయాలయ్యాయి. బస్సు సీతారామపురం నుంచి ఉదయగిరి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. క్షతగాత్రులను ఉదయగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మాధవ రెడ్డి అనే ప్రయాణికుడి కాలు విరగడంతో అతణ్ని నెల్లూరుకు తరలించారు.

మరిన్ని వార్తలు