రూ.25 లక్షల విలువైన ఎర్రచందనం స్వాధీనం

2 Apr, 2015 11:30 IST|Sakshi

కడప : వైఎస్ఆర్ జిల్లాలో అక్రమంగా ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న ముఠాను అటవీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లాలోని రైల్వేకోడూరు మండలం బాలుపల్లి రెంజీలో గురువారం అధికారులు తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా ఎర్రచందనం చెట్లను నరుకుతున్నట్టు పోలీసులు గుర్తించారు. దాంతో ముఠాలోని ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారి నుంచి 25 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.అరెస్టయిన వాళ్లందరూ తమిళనాడుకు చెందిన వారిగా గుర్తించారు. పోలీసులు కేసు నమెదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
( రైల్వేకోడూరు)

మరిన్ని వార్తలు