ఏడేళ్ల బాలికపై ఆటో డ్రైవర్ అత్యాచారం

5 Nov, 2013 12:56 IST|Sakshi

నగరంలో ఎల్బీనగర్లో మంగళవారం దారుణం చోటు చేసుకుంది. ఏడేళ్ల బాలికపై ఆటో డ్రైవర్ అత్యాచారం జరిపాడు. అనంతరం అతడు పరారైయ్యాడు. బాలిక బిగ్గరగా ఎడుస్తుండటంతో స్థానికులు వెంటనే స్పందించి, ఆ బాలిక తల్లితండ్రులకు సమాచారం అందించారు. దాంతో ఆ బాలిక ఆటో డ్రైవర్ చేసిన అకృత్యాన్ని తల్లితండ్రులకు తెలిపింది.

 

దాంతో ఆ బాలిక తల్లితండ్రులు ఎల్బీ నగర్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఆటో డ్రైవర్పై నిర్భయ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వైద్య పరీక్షల నిమిత్తం బాలికను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరారీలో ఉన్న ఆటోడ్రైవర్ను సాధ్యమైనంత త్వరగా అరెస్ట్ చేస్తామని పోలీసులు వెల్లడించారు.

>
మరిన్ని వార్తలు