ఏడేళ్ల చిన్నారికి డెంగ్యూ

5 Sep, 2015 15:23 IST|Sakshi

పాములపాడు (కర్నూలు) : కర్నూలు జిల్లాలో ఓ చిన్నారికి  డెంగ్యూ వ్యాధి సోకింది. ఈ ఘటన పాములపాడు మండలంలో శనివారం వెలుగులోకి వచ్చింది. వివరాల ప్రకారం.. మండలంలోని ఇస్కాల గ్రామంలో ఆయేషా(7) అనే చిన్నారి కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతుంది. అయితే ఆమెకు వైద్య పరీక్షలు చేయించగా డెంగ్యూ సోకినట్లు వైద్యులు తెలిపారు. చిన్నారి ప్రస్తుతం కర్నూలు ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది.

మరిన్ని వార్తలు