720 కిలోల గంజాయి స్వాధీనం

31 Dec, 2015 11:23 IST|Sakshi

విశాఖ జిల్లా నర్సీపట్నం ఎక్సైజ్ పోలీసులు గురువారం ఉదయం జరిపిన తనిఖీల్లో భారీ మొత్తంలో గంజాయి పట్టుబడింది. ఎక్సైజ్ సీఐ డీవీజీ రాజు ఆధ్వర్యంలో సిబ్బంది నెల్లిమెట్ల సమీపంలో వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఒక ఐషర్ వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 720 కిలోల గంజాయి కనిపించింది. ఇందుకు సంబంధించి చింతపల్లికి చెందిన ఐదుగురిని అదుపులోకి తీసుకుని వాహనం సహా గంజాయిని సీజ్ చేశారు.
 

>
మరిన్ని వార్తలు