తాడేపల్లి (గుంటూరు) : గ్రామ శివారులో పేకాట ఆడుతున్న ఎనిమిది మంది పేకాటరాయుళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.42 వేలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామ శివారులో శుక్రవారం సాయత్రం జరిగింది. పేకాట ఆడుతున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని నగదు స్వాధీనం చేసుకున్నారు.