తాడేపల్లి మున్సిపాలిటీలో 8 గ్రామ పంచాయతీలు విలీనం

6 Feb, 2020 19:37 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తాడేపల్లి మున్సిపాలిటీలో 8 గ్రామ పంచాయతీలను విలీనం చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రూరల్‌ మండలంలోని పెనుమాక, ఉండవల్లి, ఇప్పటం​, మల్లెంపూడి, చిర్రావురు, వడ్డేశ్వరం, గుండిమెడ, ప్రాతురు గ్రామాలు తాడేపల్లి మున్సిపాలిటీలో విలీనం అయ్యాయి. ఈ మేరకు ఎనిమిది గ్రామ పంచాయతీలను పంచాయతీరాజ్‌ శాఖ డీనోటిఫై చేసింది. (సీఆర్డీఏ చట్టంలో ఎక్కడుంది?)

మరిన్ని వార్తలు