విశాఖ స్టీల్ ప్లాంట్లో ప్రమాదం.. 8 మందికి గాయాలు

9 Jul, 2014 20:28 IST|Sakshi

విశాఖపట్నం: విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో ప్రమాదం జరిగింది. బుధవారం ఎస్‌ఎమ్‌ఎస్‌ విభాగంలో స్లాగ్ పడి ఎనిమిది మంది గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. బాధితులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సివుంది.

మరిన్ని వార్తలు