విశాఖపట్నం: విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో ప్రమాదం జరిగింది. బుధవారం ఎస్ఎమ్ఎస్ విభాగంలో స్లాగ్ పడి ఎనిమిది మంది గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. బాధితులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సివుంది.