సికింద్రాబాద్లో బస్సు బీభత్సం, 8మందికి గాయాలు

20 Nov, 2013 15:29 IST|Sakshi
సికింద్రాబాద్లో బస్సు బీభత్సం, 8మందికి గాయాలు

సికింద్రాబాద్ : విజయవాడలో ఓ కారు బీభత్సం సృష్టించిన ఘటన మరవక ముందే అటువంటి ఘటననే మరొకటి చోటు చేసుకుంది. సికింద్రాబాద్లో బుధవారం ఓ ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. గణేష్ టెంపుల్ వద్ద ఆర్టీసీ బస్సు బ్రేకులు ఫెయిలై పాదచారుల పైకి దూసుకు వెళ్లింది. ఈ సంఘటనలో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. బస్సు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

>
మరిన్ని వార్తలు