కేసీఆర్పై ఏపీలో 87 కేసులున్నాయి: యనమల

16 Jun, 2015 15:49 IST|Sakshi
కేసీఆర్పై ఏపీలో 87 కేసులున్నాయి: యనమల

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి నోటీసులు ఇచ్చే అధికారం తెలంగాణ ప్రభుత్వానికి లేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 87 కేసులు నమోదయ్యాయని ఆయన వివరించారు.

చంద్రబాబుతో మంత్రుల సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకునే ఏ చర్యకైనా తమ ప్రతిచర్య కూడా తప్పనిసరిగా ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చే అధికారం ఉంటే, తమకూ ఆ అధికారం ఉంటుందని యనమల చెప్పారు.

మరిన్ని వార్తలు