87 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

18 Sep, 2015 19:06 IST|Sakshi

దొనకొండ (ప్రకాశం) : ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలో భారీగా రేషన్ బియ్యం పట్టుబడ్డాయి. విశ్వసనీయ సమాచారం మేరకు దొనకొండ మండలం గుట్టఅమీన్‌పల్లి గ్రామంలోని ఓ ఇంటిపై శుక్రవారం మధ్యాహ్నం విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీఎస్పీ ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో సిబ్బంది దాడి చేశారు. సుబ్బారెడ్డి అనే వ్యక్తికి చెందిన రేకుల ఇంట్లో ఉన్న సుమారు 87 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

మరిన్ని వార్తలు