ఏపీలో రికవరీ రేటు 54.37 శాతం

14 Jun, 2020 05:06 IST|Sakshi

ఇన్ఫెక్షన్‌ రేటు 1.09%

మరణాల రేటు 1.40%

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్‌ నుంచి కోలుకుని శనివారం 94 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో వైరస్‌ నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,185కు చేరింది. రికవరీ రేటు 54.37 శాతంగా ఉంది. శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి శనివారం ఉదయం వరకు మొత్తం 14,477 మందికి పరీక్షలు నిర్వహించగా 222 మందికి పాజిటివ్‌గా తేలినట్టు వైద్యారోగ్య శాఖ బులెటిన్‌లో పేర్కొంది. వీరిలో 33 మంది ఇతర రాష్ట్రాల నుంచి, ముగ్గురు విదేశాల నుంచి వచ్చిన వారు.

రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 5,858కి చేరింది. వీరిలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 1,068కాగా, విదేశాల నుంచి వచ్చిన వారు 202 మంది ఉన్నారు. తాజాగా కృష్ణా జిల్లాలో ఇద్దరు మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 82కు చేరింది. ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 2,591 ఉన్నాయి. 

మరిన్ని వార్తలు