హైదరాబాద్: ప్రజాస్వామ్యంలో ఈ రోజు ఒక బ్లాక్ డే అని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఆవేదన వ్యక్తం చేశారు. ఇనుప కంచెలు వేసి జిల్లా పరిషత్ అధ్యక్ష ఎన్నికలు జరపడం ప్రజాస్వామ్యమా? అని ఆమె ప్రశ్నించరు. టీడీపీ నేతలు బరితెగించి అరాచకాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఈ ఎన్నికలలో టిడిపి నేతలు పాల్పడని అక్రమంలేదన్నారు. ప్రజాస్వామ్యవాదులందరూ బాధపడే రోజు ఇదని ఆమె అన్నారు.
జిల్లా పరిషత్ అధ్యక్ష ఎన్నిక సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా టిడిపి నేతలు అప్రజాస్వామికంగా, అమానుషంగా, అరాచకంగా వ్యవహరించారన్నారు. టిడిపి నేతల వ్యవహారశైలిని ఆమె తప్పుపట్టారు. అందుకు పోలీసులు మద్దతు పలకడాన్ని కూడా ఆమె విమర్శించారు.
ఉన్నత చదువులు చదివిన ఐఏఎస్, ఐపీఎస్లుకూడా అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గడం బాధాకరం అన్నారు. కోట్ల రూపాయల డబ్బును టీడీపీ నేతలు మంచినీళ్లలా ఖర్చు పెట్టి తమ నేతలను కిడ్నాప్ చేశారని, వారిని ప్రలోభాలకు గురిచేస్తున్నారని ఆరోపించారు.