ఉదయభాను ఫిర్యాదుతో వెబ్సైట్ నిర్వాహకులపై కేసు నమోదు

14 Dec, 2013 18:52 IST|Sakshi
ఉదయభాను ఫిర్యాదుతో వెబ్సైట్ నిర్వాహకులపై కేసు నమోదు

హైదరాబాద్: తన ఫోటోలను మార్ఫింగ్ చేశారన్న ప్రముఖ వ్యాఖ్యాత, సినిమా, టివి నటి ఉదయభాను ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.  ‘మధుమతి’ సినిమా విషయంలో ఆ చిత్ర దర్శకుడు రాజ్‌శ్రీధర్ తనని మోసం చేశారని  ఉదయభాను ఆరోపించిన విషయం తెలిసిందే. ఆమె ప్రధాన పాత్ర పోషించిన ‘మధుమతి’ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. తన ఫొటోలను మార్ఫింగ్ చేసి ప్రచార చిత్రాలు రూపొందించారని, దీనిపై న్యాయపోరాటం చేయబోతున్నానని ఉదయభాను చెప్పారు. మంచి కథ అని చెప్పి ఎక్కడా ప్రమాణాలు పాటించకుండా దర్శకుడు సినిమాను చుట్టేశాడన్నారు.  కనీసం ప్రివ్యూను కూడా తనకు చూపించలేదని ఆవేదన వ్యక్తం చేసింది.

తాను అశ్లీల దృశ్యాల్లో నటించినట్లు  మార్ఫింగ్ చేసి తన ఇమేజ్ను దెబ్బ తీశారని ఆమె బాధపడ్డారు. హాట్ సీన్లలో ఉన్నది తాను కాదని స్పష్టం చేశారు. తాను చేసిన దాంట్లో అశ్లీలత లేదని తెలిపారు.  పైగా పారితోషికం కింద తనకు రెండు లక్షల రూపాయలే ఇచ్చారని చెప్పారు. ఫొటోలు మార్ఫింగ్ విషయమై ఆమె  సిసిఎస్‌  పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఉదయభాను ఫిర్యాదుతో పోలీసులు వెబ్‌సైట్ నిర్వాహకులపై కేసు నమోదు చేశారు.  మార్ఫింగ్ జరిగినట్లు చెబుతున్న దృశ్యాలను,  ఫోటోలను ల్యాబ్కు పంపారు.

మరిన్ని వార్తలు