కుమార్తెను చంపి.. తానూ గొంతు కోసుకుని...

19 Apr, 2015 06:02 IST|Sakshi
కుమార్తెను చంపి.. తానూ గొంతు కోసుకుని...

 చిలకలూరిపేట: మద్యం మత్తులో కన్నకూతుర్నే హతమార్చిన తండ్రి ఉదంతమిది. గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్లలో ఈ ఘటన జరిగింది. వెంగళాయిపాలేనికి చెందిన కందుకూరి తిరుపతయ్య, అనంత లక్ష్మి దంపతులకు ఐదుగురు సంతానం. వీరిలో పెద్దవారు స్థిరపడి వేరు పడగా, రెండో కుమారుడు పవన్ స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నాడు. మూడో కుమార్తె మహేశ్వరి(9)అంగవైకల్యంతో ఇబ్బంది పడుతోంది.

తిరుపతయ్య మద్యానికి బానిసై తరచూ డబ్బులు ఇవ్వమని భార్యని వేధిస్తుండేవాడు. ఇటీవలే ఆమెపై కత్తితో  దాడి చేశాడు. ఈ క్రమంలో శనివారం భార్యతో గొడవకు దిగడంతో 11 గంటల సమయంలో ఆమె వినుకొండకు వెళ్లిపోయింది. ఈ సమయంలో స్కూలునుంచి వచ్చిన పవన్‌పై  కత్తితో దాడికి యత్నించాడు.  బాలుడు పరిగెత్తగా ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారి మహేశ్వరి గొంతును కత్తితో కోసి చంపాడు. తానూ మెడను కోసుకున్నాడు.  చికిత్స కోసం అతన్ని ఆస్పత్రికి తరలించారు.

మరిన్ని వార్తలు