ఆడజన్మకు ఎన్ని శోకాలో...!

11 Nov, 2013 20:17 IST|Sakshi
ఆడజన్మకు ఎన్ని శోకాలో...!

హైదరాబాద్: రెండవ సారి ఆడపిల్ల పుట్టిందని ఓ తండ్రి అమ్మకానికి పెట్టాడు. ఐసిడిఎస్ అధికారులు అడ్డుకొని ఆ చిన్నారిని శిశువు విహార్కు తరలించారు. రంగారెడ్డి జిల్లా ఆరుట్ల శివారు గ్రామం బుగ్గతండాకు చెందిన సరోజ - సుధాకర్లకు మొదట ఒక ఆడపిల్ల పుట్టింది. మళ్లీ ఇటీవలే వారికి మరో ఆడపిల్ల పుట్టింది. సుధాకర్ బిడ్డను పెంచడం భారం అనుకున్నాడు. బిడ్డను పారవేద్దామని అనుకున్నాడు. ఈ విషయం తెలిసి పెద్దలు నచ్చజెప్పారు. బంగారు తల్లి పథకం వర్తిస్తుందని చెప్పారు. అయినా అతనిలో మార్పులేదు. ఆ బిడ్డను వదిలించుకోవాలని చూశాడు.

హైదరాబాద్కు చెందిన ఒకరికి ఆ బిడ్డని పది వేల రూపాయలకు అమ్మడానికి  ఆ తండ్రి సిద్ధపడ్డాడు.  విషయం తెలిసిన స్థానిక అంగన్వాడీ టీచర్  సహకారంతో ఐసిడిఎస్ అధికారి సుగుణ అమ్మకాన్ని అడ్డుకున్నారు. ఆ బిడ్డని శిశువు విహార్కు తరలించారు. బిడ్డ ప్రస్తుతం క్షేమంగా ఉన్నట్లు సుగుణ చెప్పారు. ఇటువంటి సంఘటనలను అడ్డుకోవడానికి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. బాల్య వివాహాలు నిరోధించడానికి, ఆడపిల్లల అమ్మకాలను అడ్డుకోవడానికి వారి తల్లిదండ్రులకు నచ్చచెబుతున్నట్లు ఆమె తెలిపారు.

మరిన్ని వార్తలు