పక్షం రోజులు ముందుగా పరీక్షలు

19 Mar, 2015 00:49 IST|Sakshi
  • ఏప్రిల్ 1 నుంచే ఒకటో తరగతి నుంచి 9వ తరగతుల పరీక్షలు
  • 11 నుంచి పదో తరగతి స్పాట్ వ్యాల్యుయేషన్
  • సాక్షి, హైదరాబాద్: ఒకటో తరగతి నుంచి 9వ తరగతి వరకు వార్షిక పరీక్షలను 15 రోజుల ముందుగానే నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. సాధారణంగా వీటిని ఏప్రిల్ 15 నుంచి నిర్వహించాలని గతంలోనే తేదీలు ఖరారు చేశారు. అయితే వాటిని ఏప్రిల్ 1 నుంచే నిర్వహించాలని తాజాగా నిర్ణయించారు. ఈ నెల 25 నుంచి మొదలయ్యే టెన్త్ పరీక్షల స్పాట్ వ్యాల్యుయేషన్ ఏప్రిల్ 11 నుంచి ప్రారంభం కానుంది.

    ఈ నేపథ్యంలో అంతకంటే ముందుగానే 9 తరగతుల పరీక్షలను నిర్వహించేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. టెన్త్ స్పాట్ వ్యాల్యుయేషన్ ప్రారంభం అయితే టీచర్లంతా ఆ పనుల్లోనే ఉంటుండడంతో 1 నుంచి 9 తరగతుల పరీక్షల నిర్వహణ, మూల్యాంకనాన్ని పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో టెన్త్ మూల్యాంకనం కంటే ముందుగానే పరీక్షలను ప్రారంభించనున్నారు.

    8వ తరగతి వరకు పరీక్షలు ఆరు రోజుల్లో పూర్తి కానున్నాయి. 9వ తరగతిలో 11 పేపర్ల విధానం ప్రవేశపెట్టడంతో  ఏప్రిల్ 11తో పూర్తవుతాయని పాఠశాల విద్యా డెరైక్టర్ టి.చిరంజీవులు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు