న్యూట్రిన్ ఫ్యాక్టరీపై పట్టు రావాలి

15 Apr, 2015 02:51 IST|Sakshi
న్యూట్రిన్ ఫ్యాక్టరీపై పట్టు రావాలి

చిత్తూరు (అర్బన్) : చిత్తూరులోని న్యూట్రిన్ ఫ్యాక్టరీలో వైఎస్సార్‌టీయూసీకి పట్టురావాలని వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆ పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు పీవీ గాయత్రీదేవికి సూచించారు. సోమవారం హైదరాబాద్‌లో జగన్‌మోహన్‌రెడ్డిని ఆమె కలిశారు. తనతో న్యూట్రిన్ ఫ్యాక్టరీ గురించి జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేకంగా చర్చించారని ఆమె పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారని చెప్పారు.

>
మరిన్ని వార్తలు