మెట్టే శిఖరం పెట్టయినా...

22 Jul, 2015 13:12 IST|Sakshi
మెట్టే శిఖరం పెట్టయినా...

వీఐపీ ఘాట్ (రాజమండ్రి) : పుష్కర గోదావరి ఒడికి.. కోట్ల మంది చెంగుచెంగున, చకచకా, బిరబిరా, బిలబిలా చేరుతున్నారు. అయితే.. ఆ అమ్మ చెంతకు చేరేవారిలో రెక్కలు తెగిన పక్షుల్లాంటి వారూ ఉంటున్నారు. శరీరం సహకరించకపోయినా, పన్నెండేళ్ల పండుగలో పాలు పంచుకోవాలి, గోదారి నీటిని తలదాల్చుకోవాలన్న సంకల్పమే ఎందరినో నది దరికి రప్పిస్తోంది. మంగళవారం వీఐపీ ఘాట్‌లోకి దేకుతూనే దిగి పుణ్యస్నానం అనంతరం తిరిగి అలాగే ఒడ్డెక్కుతున్న యువతిని చిత్రంలో చూడొచ్చు.   

>
మరిన్ని వార్తలు