జీడిపప్పు గోదాములో భారీ అగ్ని ప్రమాదం

21 Nov, 2015 08:45 IST|Sakshi

శ్రీకాకుళం జిల్లా పలాస మండలం మొగిలిపాడు వద్ద జీడిపప్పు గోదాములో శనివారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం జరిగింది.  యువశంకర్ ట్రేడర్స్‌కు చెందిన గోదాములో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో తెల్లవారుజామున 3 గంటల సమయంలో మంటలు ప్రారంభమయ్యాయి. అగ్ని మాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమించారు. ఉదయం 7 గంటల తర్వాత కూడా మంటలు అదుపులోకి రాలేదు. సుమారు 2వేల బస్తాల జీడిపప్పు తగలబడి పోయిందని గోడౌన్ నిర్వహాకులు తెలిపారు.


 

మరిన్ని వార్తలు