పెట్రోల్ పోసి వ్యక్తిని తగలబెట్టిన దుండగులు

11 Feb, 2015 14:39 IST|Sakshi

నెల్లూరు: నెల్లూరు జిల్లాలోని నాయుడుపేట మండలం నర్లపల్లిలో ఓ వ్యక్తి దారుణహత్యకు గురైన ఘటన బుధవారం వెలుగుచూసింది. గుర్తు తెలియని దుండగులు వ్యక్తిని పెట్రోల్ పోసి తగలబెట్టారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం మార్చూరీకి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు హత్యకు గల కారణాలపై విచారణ జరుపుతున్నట్టు తెలిపారు.

మరిన్ని వార్తలు