పాణ్యం (కర్నూలు): డీఎస్సీ (ఉపాధ్యాయ నియామక పరీక్ష) ఫలితాల్లో తక్కువ మార్కులు వచ్చాయని ఓ విద్యార్థిని యాసిడ్ తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ సంఘటన కర్నూలు జిల్లా పాణ్యం మండలం తలపనూరు గ్రామంలో గురువారం ఉదయం జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన కాంతారావు, అన్నమ్మ దంపతుల రెండో కుమార్తె నర్మమ్మ (25) బీఎస్సీ, బీఈడీ పూర్తి చేసింది.
అయితే ఇటీవల విడుదలైన డీఎస్సీ ఫలితాల్లో తక్కువ మార్కులు వచ్చాయని మనస్తాపం చెందింది. దీంతో ఇంట్లో ఉన్న యాసిడ్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన స్థానికులు వెంటనే అతడిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.