కిడ్నాప్ కథ సుఖాంతం..

8 Oct, 2015 16:14 IST|Sakshi

తణకు: పశ్చిమగోదావరి జిల్లా తణుకులో కిడ్నాప్ కు గురైన బాలుడి కథ సుఖాంతమైంది. రెండు రోజుల కింద పాఠశాలకు వెళ్లి కిడ్నాప్కు గురైన హేమంత్(5)ను ఆగంతకులు గురువారం ఆటోలో వచ్చి ఇంటి వద్ద వదిలి వెళ్లారు.  


హోండా యాక్టివా మీద వచ్చిన ఓ వ్యక్తి చాక్లెట్ ఇస్తానని మభ్యపెట్టి సోమవారం బాలుడిని అపహరించిన విషయం తెలిసిందే. బాలుడి అక్క దుండగుడిని ప్రతిఘటించినా... ఆ చిన్నారిని తోసేసి.. ఈ కిడ్నాప్ కు పాల్పడ్డాడు. కిడ్నాప్ దృశ్యాలను సీసీటీవీ కెమెరా బంధించింది. ఈ దృశ్యాల ఆధారంగా బాలుడి ఆచూకీ కోసం పోలీసులు గత రెండు రోజులుగా తీవ్రంగా గాలించారు. దాంతో భయపడిన ఆగంతకుడు బాలున్ని ఇంటి దగ్గరే వదిలి వెళ్లాడు. తమ కుమారుడు సురక్షితంగా ఇంటికి చేరుకోవడంతో తల్లితండ్రులు ఆనందం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు