ఏసీబీ వలలో ఏడీఈ

24 Feb, 2015 16:46 IST|Sakshi

భీమడోలు(ప.గో): విద్యుత్ కనెక్షన్ ఇవ్వడానికి రైతు నుంచి లంచం తీసుకుంటూ విద్యుత్ అధికారి పట్టుబడ్డాడు. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు ఏపీఈపీడీసీఎల్ కార్యలయంలో జరిగింది. మండలానికి చెందిన రైతు సీవీ.కిషోర్ బోరుబావికి విద్యుత్ కనెక్షన్ కోసం భీమడోలు ఏడీఈ డి.ఆదినారాయణను సంప్రదించారు.

 

దానికి ఏడీఈ 80 వేలు లంచం ఇవ్వాల్సిందిగా కోరారు. అంత ఇవ్వలేనన్న రైతు చివరకు 50 వేలకు బేరం కుదుర్చుకొని ఆ విషయాన్ని ఏసీబీ అధికారులకు తెలియజేశాడు. పధకం ప్రకారం మంగళవారం కార్యలయంలో ఏడీఈ ఆదినారాయణ లంచం తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకున్నారు.

మరిన్ని వార్తలు