సబ్ రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ దాడులు

29 Dec, 2015 16:36 IST|Sakshi

మధురవాడ (విశాఖపట్నం) : సబ్ రిజిస్ట్రార్ ఆనందరావు ఇంటిపై ఏసీబీ అధికారులు మంగళవారం దాడులు నిర్వహిస్తున్నారు. మధురవాడ సబ్ రిజిస్ట్రార్ గా పనిచేస్తున్న ఆనందరావుపై అవినీతి ఆరోపణలు రావడంతో విశాఖపట్నం ఏసీబీ అధికారులు, పశ్చిమగోదావరి ఏసీబీ అధికారులు ఏకకాలంలో ఆయన కార్యాలయం, ఇంటిపై దాడులు నిర్వహించారు.

మధురవాడలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై పశ్చిమగోదావరి ఏసీబీ డీఎస్‌పీ కరణం రాజేంద్ర ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. విశాఖపట్నం లాసన్స్‌బే కాలనీలోని సబ్ రిజిస్ట్రార్ ఇంటిపై విశాఖ ఏసీబీ డీఎస్‌పీ రామకృష్ణరావు ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. అలాగే పశ్చిమ గోదావరి నర్సాపురంలో కూడా ఏసీబీ అధికారులు దాడులు చేసినట్లు తెలిసింది. పూర్తి వివరాలు అందాల్సి ఉంది.

మరిన్ని వార్తలు