ఐటీఐ ప్రిన్సిపల్ నివాసంపై ఏసీబీ దాడి

27 Mar, 2014 14:51 IST|Sakshi

విశాఖ : ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణతో విశాఖపట్నంలోని  ఐటీఐ ప్రిన్సిపల్ సత్యనారాయణ నివాసాలపై ఏసీబీ అధికారులు గురువారం దాడులు చేశారు. ఎడ్ల సత్యనారాయణకు చెందిన విశాఖపట్నం, సింహాచలంలోని శ్రీనివాసనగర్‌లో ఉన్న నివాసాలతో పాటు తొమ్మిది ప్రాంతాల్లో ఏకకాలంలో ఈ దాడులను నిర్వహించారు. డీఎస్పీ నరసింహారావు నేతృత్వంలో ఈ దాడులు జరిగాయి. సోదాలలో నేపథ్యంలో అధికారులు పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి.

>
మరిన్ని వార్తలు