సంక్షేమ హాస్టళ్లపై ఏసీబీ దాడులు

29 Jan, 2016 08:44 IST|Sakshi

నందిగామ: కృష్ణా జిల్లా నందిగామలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లపై ఏసీబీ అధికారులు శుక్రవారం ఉదయం దాడులకు దిగారు. విద్యార్ధుల సంఖ్య, రికార్డుల్లోని వివరాల తనిఖీ చేపట్టారు. కాగా, ఎస్టీ హాస్టల్‌లో కుక్ ఒక్కరే ఉండగా, విద్యార్థులు ఎవరూ లేకపోవడం తనిఖీలకు దిగిన అధికారులను ఆశ్చర్యానికి గురిచేసింది. 20 మంది విద్యార్థులు ఉన్నారని కుక్ చెప్పగా, హాస్టల్ లో ఒక్క విద్యార్థి కనిపించలేదు. కాగా సంబంధిత సంక్షేమ అధికారి అందుబాటులో లేనట్టు సమాచారం.

>
మరిన్ని వార్తలు