రిషితేశ్వరి కేసులో నిందితులకు బెయిల్ వాయిదా

28 Aug, 2015 13:32 IST|Sakshi

గుంటూరు లీగల్: రిషితేశ్వరి కేసులో నిందితులు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ వాయిదా పడింది. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి మృతికేసులో నిందితులైన హనీష, ధరావత్ చరణ్, నరాల శ్రీనివాస్ దాఖలు చేసుకున్న బెయిల్ పిటీషన్ వాదనలు వినేందుకు న్యాయమూర్తి జి.గోపీచంద్ గురువారానికి వాయిదా వేశారు. ఏపీపీ రామచంద్రరావు వాదనలు వినిపించేందుకు సమయం కావాలని అడగడంతో న్యాయమూర్తి గోపీచంద్ వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీచేశారు.

>
మరిన్ని వార్తలు