నిమ్మకూరులో హీరో బాలకృష్ణ ప్రత్యేక పూజలు

11 Jan, 2014 10:18 IST|Sakshi
నిమ్మకూరులో హీరో బాలకృష్ణ ప్రత్యేక పూజలు

వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని సినీహీరో బాలకృష్ణ స్వగ్రామమైన నిమ్మకూరులోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామీ వారి తీర్థప్రసాదాలను పండితులు బాలకృష్ణకు అందజేశారు.  ఎన్టీఆర్ ట్రస్ ఏర్పాటు చేసిన మంచినీటి పథకాన్ని నిమ్మకూరులో ఆయన ప్రారంభించనున్నారు.

 

బాలకృష్ణను చూసేందుకు అభిమానులు భారీగా నిమ్మకూరు తరలివచ్చారు. అలాగే తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు ప్రముఖ నాయకులు కూడా బాలకృష్ణకు కలిసేందుకు ఇప్పటికే నిమ్మకూరు చేరుకున్నారు.

మరిన్ని వార్తలు