నల్ల బ్యాడ్జీలు ధరించి టీటీడీ ఉద్యోగుల నిరసన

24 May, 2018 10:08 IST|Sakshi

రమణ దీక్షితులు ఆరోపణలపై టీటీడీ ఉద్యోగుల నిరసన

నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు

టీటీడీ ఉద్యోగుల వైఖరిని ఖండించిన నటి కవిత

సాక్షి, తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఉద్యోగుల వైఖరిని నటి, బీజేపీ మహిళా నేత కవిత ఖండించారు. శ్రీవారి ఆలయంలో టీటీడీ ఉద్యోగులు,అర్చకులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులు నిర్వహించడాన్ని ఆమె తప్పుబట్టారు. ఈ సందర్భంగా కవిత గురువారమిక్కడ మాట్లాడుతూ.. ఇప్పటికే శ్రీవారి ఆలయ పరువు తీస్తున్నారని, నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపట్టడం బాధ కలిగించిందన్నారు. ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకుని సమస్యలు పరిష్కరించాలని ఆమె కోరారు.

కాగా ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు వైఖరిని నిరసిస్తూ టీటీడీ ఉద్యోగులు ఈ నిరసన చేపట్టారు. ఆలయ ప్రతిష్టను దిగజార్చేలా విమర్శలు చేస్తున్నారంటూ ఉద్యోగులు మండిపడుతున్నారు. మూడు రోజుల పాటు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు కావాలని ఉద్యోగులు నిర్ణయం తీసుకున్నారు.

మరిన్ని వార్తలు