వెంకన్నను దర్శించుకున్న నటి స్నేహ

6 Sep, 2014 10:53 IST|Sakshi
వెంకన్నను దర్శించుకున్న నటి స్నేహ

తిరుమల : సినీనటి స్నేహ శనివారం ఉదయం తన కుటుంబంతో తిరుమల శ్రీవారి దర్శనం చేసుకుంది. వీఐపీ  బ్రేక్‌ దర్శనం సమయంలో ఆమె తన భర్త ప్రసన్నతో కలిసి ఆమె వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో స్వామివారిని దర్శించుకుంది. అనంతరం స్నేహను రంగనాయకుల మండటంలో అర్చకులు ఆశీర్వదించి శ్రీవారి ప్రసాదాలు అందించారు. వివాహం అనంతరం స్నేహ ....ప్రకాష్ రాజ్ దర్శకత్వంలో వచ్చిన 'ఆవకాయ బిర్యానీ'లో నటించిన విషయం తెలిసిందే. కాగా స్నేహ దంపతులను చూసేందుకు భక్తులు ఆసక్తి చూపించారు. మరోవైపు ఆమెను మాట్లాడాలని మీడియా ప్రతినిధులు కోరగా సున్నితంగా తిరస్కరించారు.

 

మరిన్ని వార్తలు