వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ శ్వేతాబసు ప్రసాద్!

31 Aug, 2014 23:22 IST|Sakshi
వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ శ్వేతాబసు ప్రసాద్!

హైదరాబాద్: వర్ధమాన నటి శ్వేతాబసు ప్రసాద్ వ్యభిచారం చేస్తూ పోలీసులకు పట్టుబడినట్లు తెలుస్తోంది. ఆదివారం రాత్రి  నగరంలోని ఒక స్టార్ హోటల్లో వ్యభిచారం చేస్తూ పోలీసులకు పట్టుబడినట్లు సమాచారం.  బంజారాహిల్స్ లోని పార్క్ హయాత్ హోటల్లో టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆకస్మికంగా చేసిన దాడిలో శ్వేతాబసు ప్రసాద్ ను అదుపులోకి తీసుకున్నారని ప్రాథమిక సమాచారం. ఇందులో బాలు అనే వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా ఓ స్టార్ హోటల్లో ఆమె వ్యభిచారం నిర్వహిస్తున్నారనే వార్తలు కూడా ఊపందుకున్నాయి.

 

కొన్నేళ్ళ క్రితం ‘కొత్త బంగారు లోకం’ చిత్రంలో హీరో వరుణ్ సందేశ్ సరసన మెరిసిన కథానాయిక శ్వేతాబసు ప్రసాద్.. తొలి చిత్రంతోనే అనూహ్యమైన గుర్తింపు సాధించినా తరువాత అనూహ్యంగా వెనుకబడ్డారు.

మరిన్ని వార్తలు