ఎన్ని సర్వీసులైనా నడుపుతాం:ఆర్టీసి ఎండి

13 Jan, 2014 20:41 IST|Sakshi
ఎన్ని సర్వీసులైనా నడుపుతాం:ఆర్టీసి ఎండి

హైదరాబాద్: సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికులకు ఇబ్బంది కలుగకుండా ఎన్ని అదనపు బస్ సర్వీసులైనా నడుపుతామని ఆర్టీసీ ఎండీ పూర్ణ చంద్రరావు చెప్పారు.  నిన్నటి వరకు 9, 251 అదనపు బస్సులు నడిపినట్లు తెలిపారు. ఈరోజు మరో 526 బస్సులు నడుపుతున్నామని చెప్పారు.

రేపు 249 అదనపు సర్వీసులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 320 ప్రైవేట్ బస్సులు సీజ్ అయిన నేపథ్యంలో తాము అదనపు బస్సులు నడుతున్నట్లు చెప్పారు. గత 3 రోజులుగా 12 లక్షల మంది ప్రయాణికులను వారి గమ్య స్థానాలకు చేర్చినట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు