సాక్షి, అమరావతి : శాసనసభ సమావేశాలు ఎన్ని రోజులయిన నిర్వహించే ధైర్యం తమ ప్రభుత్వానికి ఉందని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. ఏ అంశం గురించైనా చర్చకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సిద్దంగా ఉన్నారని ఆయన తెలిపారు. ప్రభుత్వ విధానాలకు అనుగుణంగానే ఎమ్మెల్యేలకు సభా సంప్రాదాయాలపై శిక్షణ ఇస్తున్నట్టు తెలిపారు. ఎలాంటి వృథా ఖర్చులు లేకుండానే అసెంబ్లీ కమిటీ హాల్లో శిక్షణా తరగతులు చేపట్టామన్నారు. గత ప్రభుత్వం ఎమ్మెల్యేల శిక్షణ కార్యక్రమాన్ని ఖరీదైన హోటళ్లలో విందులతో ప్రజా ధనాన్ని వృథా చేసిందని గుర్తుచేశారు.