అగ్రిగోల్డ్ ఏజెంట్ ఆత్మహ త్యాయత్నం

13 Feb, 2016 04:00 IST|Sakshi

నార్పల : నార్పలకు చెందిన అగ్రిగోల్డ్ ఏజెంట్ రహింబీ శుక్రవారం ఆత్మహత్యాయత్నం చేశారు. అగ్రిగోల్డ్ ఏజెంట్‌గా వ్యవహరించిన ఆమె పలువురి నుంచి డిపాజిట్లు సేకరించారు. ప్రస్తుతం ఆ సంస్థ వివాదాలు, కోర్టు కేసుల్లో ఇరుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాము కట్టిన డబ్బులు వెనక్కి ఇవ్వాలంటూ కొందరు పాలసీదారులు ఒత్తిడి తెచ్చినట్లు తెలిసింది. దీంతో ఆమె విషం తాగి ఆత్మహత్యాయత్నం చేయగా బంధువులు గమనించి వెంటనే ఆమెను 108లో అనంతపురం పెద్దాస్పత్రికి తరలించారు.

>
మరిన్ని వార్తలు