బీజేపీ ఎందుకు మాట్లాడలేదు: శోభా ఓఝా

8 Jun, 2015 17:08 IST|Sakshi

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఓటుకు నోటు వైఖరిపై భారతీయ జనతా పార్టీ ఎందుకు మాట్లాడలేదని ఏఐసీసీ అధికార ప్రతినిధి శోభా ఓఝా ప్రశ్నించారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడారు.

 

ఆ కేసుకు సంబంధించి జ్యుడీషియల్ విచారణ జరిపించాలని ఆమె డిమాండ్ చేశారు. జ్యుడీషియల్ విచారణ ప్రారంభం కావడానికి ముందే ఏపీ సీఎం చంద్రబాబు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీతో పాటుగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు పెదవి విప్పలేదని ఆమె మండిపడ్డారు.

మరిన్ని వార్తలు