విశాఖలో ఎయిర్‌ ఇండియా విమానం నిలిపివేత

15 Nov, 2019 21:04 IST|Sakshi

సాక్షి, విశాఖపట్టణం : అండమాన్‌ నుంచి ఢిల్లీ వెళ్తున్న ఎయిర్‌ ఇండియా విమానాన్ని సాంకేతిక లోపం వల్ల విశాఖలో శుక్రవారం నిలిపివేశారు. విమానంలో 90 మంది ప్రయాణీకులు ఉండగా వారికి విశాఖలోనే వసతి, భోజన సదుపాయాలను ఎయిర్‌ ఇండియా సంస్థ ఏర్పాటు చేసింది. విమానంలో సాంకేతిక లోపాన్ని సరిచేసిన తర్వాత రేపు (శనివారం) విమానం ఢిల్లీ బయలుదేరి వెళ్తుందని ఎయిర్‌ ఇండియా తెలిపింది. 

మరిన్ని వార్తలు