ఎయిర్ పోర్టు స్థలంపై సర్వే

7 Aug, 2014 02:22 IST|Sakshi
ఎయిర్ పోర్టు స్థలంపై సర్వే

గూడెపువలస (భోగాపురం): మండలంలోని గూడెపువలసలో ఏర్పాటు చేయనున్న ఎరుుర్ పోర్టుకు సంబంధించిన స్థలాన్ని బు ధవారం కేంద్రం నుంచి వచ్చిన సర్వే బృందం పరిశీలించింది. బృంద సభ్యు లు గ్రామంలోని ప్రభుత్వ భూమి వివరాలను రెవె న్యూ అధికారులను అడిగి తెలుసుకున్నారు. గతంలో 2560 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నట్టు గుర్తించా రు. ఈ మేరకు సదరు భూమి   ప్లాన్‌ను గూగుల్ మ్యాపు ద్వారా పరిశీలించారు. ఆ ప్రాంతంలో గాలి దిశ ఏవిధంగా ఉందన్న అంశాన్ని కూడా పరిశీలించా రు. స్థలం సమీపంలో భారీ విద్యుత్ లైన్లు, కొబ్బరి తోటలు, జీడి మామిడి తోటలు ఉన్నాయూ అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. బృం దానికి కలెక్టరు ఎం.ఎం నాయక్ పూర్తి వివరాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో బృంద సభ్యులతో పాటు ఆర్‌డీఓ వెంకటరావు, తహశీల్దార్ జనార్ధనరావు, సర్వేయరు పాల్‌దాస్ నాయుడు, తదితరులు పాల్గొన్నారు.
 

>
మరిన్ని వార్తలు