బాధ్యతలు స్వీకరించిన కల్లం, శ్రీరామ్‌

5 Jun, 2019 14:47 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్య సలహాదారుగా అజేయ్‌ కల్లం బుధవారం బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని మొదటి బ్లాక్‌లోని బాధ్యతలు చేపట్టిన ఆయనకు సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం అభినందనలు తెలిపారు. అంతకు ముందు అజేయ్‌ కల్లం తాడేపల్లిలోని సీఎం నివాసంలో వైఎస్‌ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.

ఏజీగా బాధ్యతలు చేపట్టిన సుబ్రహ్మణ్యం శ్రీరామ్‌
మరోవైపు ఆంధ్రపద్రేశ్‌ హైకోర్టు అడ్వకేట్‌ జనరల్‌గా సుబ్రహ్మణ్యం శ్రీరామ్‌ బాధ్యతలు చేపట్టారు. ఆయన తన ఛాంబర్‌లో కుటుంబసభ్యులతో కలిసి పూజలు చేశారు.  సీఎంగా వైఎస్‌ జగన్‌ బాధ్యతలు స్వీకరించిన వెంటనే అడ్వొకేట్‌ జనరల్‌గా శ్రీరామ్‌ను నియమించాలని నిర్ణయించారు. శ్రీరామ్‌ 1969లో జన్మించారు.

మరిన్ని వార్తలు