నెల్లూరు: ఏఎస్పీ శరత్బాబు గన్మెన్ ఏకే-47 మిస్ఫైర్ అవడంతో డ్రైవర్ రమేష్ మృతిచెందారు. ఈ సంఘటన జిల్లా పోలీసు కార్యాలయంలో చోటుచేసుకుంది. వివరాలు ఏకే 47 మిస్ఫైరై రమేష్ ఛాతిలోకి ఒక్కసారిగా బుల్లెట్ దూసుకెళ్లింది.
వెంటనే ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రమేష్ చనిపోయారు. కాగా రమేష్ను హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలన్నారు.