మద్యం కోసం ఎగబడిన జనం
కళ్యాణదుర్గం: పట్టణంలో మద్యం కోసం దుకాణాల వద్ద మందుబాబులు ఎగబడ్డారు. ఎన్నికల నేపథ్యంలో 48 గంటల పాటు మద్యం దుకాణాలు మూతపడ్డాయి. అయితే పట్టణంలో గురువారం రాత్రి 8 గంటలకే మద్యం దుకాణాలు తెరిచారు. మద్యం కొరత కారణంగా డిమాండ్ పెరిగింది. దీంతో ఏ దుకాణం చూసినా మందుబాబులతో కిటకిటలాడుతున్నాయి. కొన్ని చోట్ల దుకాణాల్లో దూసుకొస్తుండడంతో దుకాణదారులు మద్యం ప్రియులను నియంత్రించలేని పరిస్థితి నెలకొంది. ఇదే సమయంలో వారి బలహీనతను ఆసరాగా తీసుకున్ని మద్యం షాపు యజమానులు క్వాటర్ బాటిల్పై రూ.20 నుంచి రూ.30 అదనంగా వసూలు చేస్తున్నారు.