'మడా' ముసుగులో మరో భూదోపిడీ

12 Jul, 2016 12:41 IST|Sakshi

విజయవాడ: మచిలీపట్నం పోర్టు పేరుతో భూ దోపిడీని వ్యతిరేకిస్తూ అఖిలపక్ష నేతలు మంగళవారం సమావేశమయ్యారు. మడా (మచిలీపట్నం ప్రాంత ప్రాధికార సంస్థ) ముసుగులో ప్రభుత్వం మరో భూ దోపిడీకి యత్నిస్తోందని అఖిలపక్ష నేతలు ధ్వజమెత్తారు. ఈ సమావేశానికి వడ్డే శోభనాద్రీశ్వరరావు, సి.రామచంద్రయ్య, పేర్ని నాని, సీపీఐ రామకృష్ణ, సీపీఎం మధు, మాజీ ఎమ్మెల్సీ విల్సన్తో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు. మచిలీపట్నం పోర్టు నిర్మాణానికి 1.05 లక్షల ఎకరాలను సమీకరించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

 

మరిన్ని వార్తలు