ఇప్పటికే ఓ సారి చిరంజీవి చేతిలో నష్టపోయారు

21 Mar, 2018 07:16 IST|Sakshi
చిరంజీవి-పవన్‌ కల్యాణ్‌..........కాపునాడు అధ్యక్షుడు పిళ్లా వెంకటేశ్వర రావు

విజయవాడ : ఇప్పటికే కాపు సామాజిక వర్గం సినీ నటుడు, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి చేతుల్లో తీవ్ర నష్టాలకు గురైందని ఏపీ కాపునాడు అధ్యక్షుడు పిళ్లా వెంకటేశ్వర రావు ఓ ప్రకటనలో సంచనల వ్యాఖ్యలు చేశారు. పవన్‌ కల్యాణ్‌ రూపంలో మరో చిరంజీవి నాటి పరిస్థితులకు కాపు సామాజిక వర్గం గురైతే, సభ్య సమాజంలో మరో పాతికేళ్ల వరకూ తలెత్తుకు తిరగలేని పరిస్థితి ఎదుర్కోవలసి వస్తోందని అన్నారు. ఈ దుస్థితిని కాపు సామాజిక వర్గానికి కల్పించవద్దని పవన్‌ కల్యాణ్‌కు విజ్ఞప్తి చేశారు. ఏపీ హక్కుల సాధనకు పోరాటం చేస్తోన్న సీఎం చంద్రబాబు నాయుడికి అభినందనలు తెలియజేస్తున్నట్లు చెప్పారు.

చంద్రబాబు పోరాటాన్ని బలహీనపరిచే ఏ చర్య అయినా..కాపు సామాజిక వర్గ ప్రయోజనాలను దెబ్బతీస్తుందని గట్టిగా భావిస్తున్నానని తెలిపారు. చంద్రబాబు నాయకత్వాన్ని బలపరచవలసిన తరుణంలో పవన్‌ కల్యాణ్‌ వ్యవహార శైలి కాపులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నదని వెల్లడించారు. బీజేపీ హామీలు మరచిన విధానం చూడగానే తెలుగువారికి ఒళ్లు కంపరం పుడుతున్న దశలో..బీజేపీ భావాలకు వకాల్తా పుచ్చుకుని కాపు సామాజిక వర్గానికి ద్రోహం తలపెట్టవద్దని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు