పోలీసులు, బీజేపీ నేతల మధ్య వాగ్వాదం

18 Oct, 2019 13:56 IST|Sakshi

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా : బీజేపీ చేపట్టిన గాంధీ సంకల్ప యాత్రలో శుక్రవారం స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. బద్వేలులో యాత్ర నిర్వహిస్తున్న బీజేపీ నేతలు స్థానిక గాంధీ విగ్రహం వద్ద సభ ఏర్పాటు చేశారు. సభలో పాల్గొనేందుకు వెళ్తున్న ఆ పార్టీ నేతలను ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా పక్కనుంచి వెళ్లమని  పోలీసులు సూచించారు. దీంతో కోపోద్రిక్తులైన బీజేపీ నాయకులు పోలీసులపై ఫైర్‌ అయ్యారు. ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అయితే వాగ్వాదం ఉద్రిక్తంగా మారే అవకాశముండడంతో పోలీసులే వెనక్కు తగ్గారు.  

మరిన్ని వార్తలు